ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..
సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా 400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటన..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు
ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి అని సూచిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం అని వెల్లడించారు.
సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం అని డిప్యూటీ సీఎం అన్నారు.
