292 డివిజన్ సాయిబాబా నగర్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళా సంఘాలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ అనుమంత్ రెడ్డి విచ్చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి మహిళలకు వివరించడం జరిగింది. అలాగే మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత ముందుకు రావాలని సూచించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్యాము, భాస్కర్ రెడ్డి, హరి, కిరణ్, , గోపాల్ ముదిరాజ్, కరణ్, చందు, గణేష్, సందీప్,
మరియు మహిళా సోదరులు మనీ, శైలజ, తులసి,ఆసియా బేగం, మిగతా ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

