ఉప్పల్ సర్కిల్-2 లో జోరుగా అక్రమ నిర్మాణాలు..
అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ రాజు కు ప్రజావాణిలో పిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి…
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ఉప్పల్ జీహెచ్ఎంసీ వారు పేదవారికి ఒక న్యాయం, ఉన్నవారికి మరొక న్యాయంగా వ్యవహరిస్తున్నారు.
పేదవారు రెండు రూముల కడితే కూల్చితారు. ఉన్నవారు ఎన్ని అంతస్తులు నిర్మించిన వారిని ఏమనరు.
ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులు హై కోర్టు ఆర్డర్ ను కూడా ధిక్కరిస్తున్నారు.
హైకోర్టు ఆర్డర్ ప్రకారం తూతూ మంత్రంగా ఇల్లీగల్ బిల్డింగ్ ను సీజ్ చేస్తారు. మరుసటి రోజు బిల్డింగ్ యధావిధిగా ఓపెన్ అవుతుంది.
స్పష్టంగా హైకోర్టు ఆర్డర్ ను ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు ధిక్కరిస్తూ, కొందరి కను చూపుల్లో పనిచేస్తున్నారు.
ఉప్పల్ జీహెచ్ఎంసీ కి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం ఇల్లీగల్ గా ఎవరికి పోతుందో డిప్యూటీ కమిషనర్ ను నిలదీసాము.
ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి కొట్టే విధంగా ఉప్పల్ లో బారీగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.
ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని, హైకోర్టు ఆర్డర్ ప్రకారం అధికారులు నడుచుకుంటూ, ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగా ఉప్పల్ జీహెచ్ ఎంసీ అధికారులు నడుచుకోవాలన్నారు.

