అయ్యప్ప ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ మరియు మల్లంపేట్ లో శబరికి బయలుదేరుతున్న అయ్యప్ప స్వాముల బృందం వారి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి దీక్షలు చేసి శబరికి వెళ్లి ఇరుముడి సమర్పిస్తున్న సందర్భంగా శబరికి క్షేమంగా వెళ్లి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అయ్యప్ప స్వాములు, కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
