భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం ముత్యాలమ్మ తల్లి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
132 – జీడిమెట్ల డివిజన్ హెచ్ఐఎల్ రాఘవేంద్ర కాలనీలోని ముత్యాలమ్మ దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొలిచిన భక్తుల కొంగు బంగారం నిలిచే ముత్యాలమ్మ తల్లి కృపాకటాక్షాలు భక్తులపై సంపూర్ణంగా ఉండాలని, అమ్మవారి దయతో ప్రజలంద సంతోషంగా జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయం చైర్మన్ టి.రాజేశ్వర్, ఆర్ధిక కార్యదర్శి బాలరాజు, కాలనీ అధ్యక్షులు కుంట సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శి తోకల నగేష్ రెడ్డి, కోశాధికారి రాజు, అధ్యక్షులు ఐ.ప్రభాకర్ రెడ్డి, మల్లేశం, ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాములు, ప్రవీణ్, జీవన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, కాలే గణేష్, ఆటో బలరాం, కుంట వేణు, విజయ హరీష్, జయం చారి, రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, మధుకృష్ణ, అప్పల శేఖర్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
