బిఆర్ఎస్ కన్వీనర్ గా జుజ్జురి వెంకన్న బాబు నియమకం

Sakshitha news

బిఆర్ఎస్ కన్వీనర్ గా జుజ్జురి వెంకన్న బాబు నియమకం

సాక్షిత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం బిఆర్ఎస్ కన్వీనర్ గా జుజ్జురి వెంకన్న బాబు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ నియమకాన్ని ప్రకటించారు. పార్టీ నిర్మాణంలో లోపాలు సరిదిద్ది, అన్ని మండలాలు, పట్టణాలకు బాధ్యతలను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్టీని బలోపేతం చేసి, స్థానిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Scroll to Top