జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పత్రికా సమావేశంలో మాట్లాడమైనది
•రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం,రైతుల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
•జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విజయ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
•గురివింద గింజ సామెతగా ఈ పిటీషన్ విజయ్ కుమార్ వేశారు.
•సీనియర్ ఐఏఎస్ హోదాలో ఉండి పబ్లిక్ మీటింగ్ లో విజయ కుమార్ పాటలు పాడ లేదా..
•అమర్ రాజా బ్యాటరీ ల కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటంలో నీ పాత్ర లేదా..
•తాడేపల్లి డైరెక్షన్ లో పిటీషన్ వేసి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
•పవన్ కళ్యాణ్ ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడ లేదు.
•జనసేన పార్టీ పెట్టాక ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు.
•అధికారంలో ఉన్న సమయంలో విజయ కుమార్ వందలకోట్లు వెనకేసుకోలేదా..
•పంచాయితీ రాజ్ శాఖ ను పునరుజ్జీవనం కలిగించి, సర్పంచ్లకు గౌరవం కల్పించారు.
•అధికార దుర్వినియోగం వైసీపీ పాలనలో జరిగింది.
•వైసీపీ నేతలు రాజకీయాన్ని వ్యాపారం చేసి వందలకోట్లు దోచుకున్నారు.
•చట్టప్రకారం విజయ కుమార్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
•అవాస్తవాల తో పిటీషన్ వేయగానే ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు.
•రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, శిఖా బాల కోటేశ్వరరావు(బాలు), చట్టాల త్రినాథ్,మధు లాల్,పవన్ వెంకీ,కిషోర్ పాల్గొన్నారు..
