పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: సాక్షిత): శంకర్పల్లి మండల పరిధిలోని పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడ గ్రామంలో గల శ్రీ పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. రాజేంద్రప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ మాధవరెడ్డి హీరోను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. హీరో మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు హీరో తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
