గణపతి మండపంలో శివలింగాకారంతో దర్శనమిస్తున్న గణపతి లడ్డు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివలింగాకారంతో తయారుచేసిన గణపతి లడ్డు దండా బత్తుల వారి వీధిలో డిఎన్ కే యూత్ వారు ఏర్పాటుచేసిన గణపతి మండపంలో ఈ లడ్డును ప్రదర్శించారు. అశ్వారావుపేట కు చెందిన ఓ స్వీట్ షాప్ యజమాని 35 కిలోలతో శివలింగాకారంతో ఈ లడ్డును తయారుచేసి అందించారు. భక్తులు లడ్డును చూసి ఆశ్చర్యపోయరు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు, యావన్మంది భక్తులు పాల్గొన్నారు.
