గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న : మాజీ ఎమ్మెల్యే తాటి
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకర్ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు గణపయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. గణనాధుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరి సంపదలతో ఉండాలని ఆ గణనాధుని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘనాయకులు, ఉత్సవ కమిటీ నాయకులు, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
