ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మాజీమంత్రి హరీష్ రావు ను నానక్ రామ్ గూడ లోని నివాసంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
