బతుకమ్మ పండుగ సందర్భంగా 19. 09. 2025, నిజాంపేట, రాజీవ్ గృహ కాల్ప లో నల్లమల్లిస్ ఆదర్శ మహిళ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్ పర్సన్ శ్రీమతి. నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి ( రాధ) * నిర్వహిస్తున్న 1000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కోసం టోకెన్ల పంపిణి కార్డ్స్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా టోకెన్ల పంపిణి కార్డ్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, స్రవంతి, పి . శశికళ, శశికళ, రాధిక, అనంతలక్ష్మి పాల్గొన్నారు.
