జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్..
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకోసం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మార్చిలో స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించి స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లను రిక్రూట్ చేస్తామని తెలిపారు. స్పెషల్ డీఎస్సీలో భాగంగా ఆర్థిక శాఖ 2,260 పోస్టులకు ఆమోదం తెలిపింది. డీఎస్సీకి ముందు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
