చిలకలూరిపేటలో కోర్టు భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.
సాక్షిత : పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరిపేటలో కోర్టు భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో స్థల వివరాలు, భవిష్యత్ అవసరాలను అడిగి తెలుసుకున్నారు.చిలకలూరిపేట పట్టణ పరిధిలో కోర్టు భవన నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు.కోర్టు కార్యకలాపాలకు అవసరమైన భవనం విస్తీర్ణం, రహదారి అనుసంధానం, ప్రజలకు రాకపోక సౌలభ్యం వంటి అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు.
కోర్టు స్థాపనకుసంబంధించి భూమి లభ్యత, రాజాస్వ, మున్సిపల్ పరిమితులు వంటి పరిపాలనా అంశాలపైకార్యాచరణ ప్రణాళికను వారు సమీక్షించినట్లు తెలుస్తోంది.కోర్టు భవనం అవసరంపై చర్చస్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో చిలకలూరిపేటలో శాశ్వత కోర్టు భవనం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికారులు సంకేతాలుఇస్తున్నారు.ప్రతిపాదిత స్థలంపై సాంకేతిక నివేదికలు,న్యాయశాఖ సూచనలు అందిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలుచర్చించుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత, చిలకలూరిపేట తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్,మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
