బహదురుపల్లి కాలనీల్లో అభివృద్ధి పనులపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం)
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి 13వ వార్డు స్మశాన వాటిక మరియు వినాయక నగర్ కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కాలనీ వాసులు ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి గారు, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితంగా అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు ఎండి సలీమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగభూషణం, గణేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
