మహాలింగాపురం గ్రామంలో బిజెపి నాయకుల స్వచ్ఛభారత్
సాక్షిత శంకర్పల్లి: శంకర్పల్లి మండల మహాలింగాపురం గ్రామంలో శుక్రవారం మండల పార్టీ అధ్యక్షురాలు లీలావతి భయానంద్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించి, మరల మొక్కలను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహ, కందాడ ప్రతాపరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ చారి, మాణిక్ రెడ్డి, నర్సింలు ఉన్నారు.
