విజయవాడలో భవానీ దీక్షా విరమణ… ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం IPS స్వయంగా పర్యవేక్షణ
సాక్షిత : విజయవాడలో కొనసాగుతున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమాల నేపథ్యంలో నగరంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం IPS స్వయంగా ఫీల్డ్లోకి దిగి ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు.
డీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ—
“భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులకే కాకుండా సాధారణ వాహనదారులకు కూడా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ మార్గాలు, డైవర్షన్లు ఏర్పాటు చేశాం. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం” అని తెలిపారు.

