రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Sakshitha news

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

సాక్షిత ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం బచ్చువారి గూడెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మడివి వరుణ్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ డీ కొట్టడంతో వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. యువకుడి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.