ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, ఎంపీ విపిఆర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు తన నివాసంలో మధ్యాహ్నం ఇచ్చిన విందుకు మంత్రి నారా లోకేష్ హాజరవగా.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఎంపీలందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. మంత్రి నారా లోకేష్ తో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
