చిలకలూరిపేటలో టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం……

Sakshitha news

చిలకలూరిపేటలో టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం

సాక్షిత చిలకలూరిపేట: మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశంనిర్వహించబడింది.

అంబేడ్కర్ విగ్రహ ధ్వంసంపై టీడీపీ ఆగ్రహం

ఈ సమావేశంలో చిత్తూరు జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వెనుక దళితులను రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే దురుద్దేశం ఉందని నాయకులు ఆరోపించారు.టీడీపీ నాయకులు మాట్లాడుతూ, “అంబేడ్కర్ విగ్రహం అంటే దేశ గౌరవం – దానిపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే” అని తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ బాబుపై దాడి జరిగినప్పుడు, ఆ సమయంలో దళితులపై జరిగిన దాడులపై ఒక్క మాట కూడా మాట్లాడని నాయకులు ఇప్పుడు దళితులను ఉద్ధరించినట్టుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు.దళితులపై దాడి చేసిన వారిని ప్రమోషన్ ఇచ్చి, పక్కన కూర్చోబెట్టుకుని సెల్ఫీలు దిగిన జగన్‌ కూడా ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారు విమర్శించారు. చిత్తూరు ఘటనలో ముఖ్యమంత్రి జగన్‌ను కూడా A2 నిందితుడిగా చేర్చాలని చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇనగంటి జగదీష్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండా వీరయ్య, చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావుతో పాటు దళిత ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.