ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఐఏఎస్ ఆఫీసు

Sakshitha news

ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఐఏఎస్ ఆఫీసు అసోసియేషన్ క్లబ్ గ్రీన్ ల్యాండ్స్ లో నిర్వహించిన ఆత్మకూర్ నరసింహులు గౌడ్ కుమారుడు ప్రవీణ్ (54) దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ప్రవీణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం అందించాలని ప్రార్దిచడం జరిగింది. ఇటీవల జరిగిన నేపాల్ వరద బీభత్సంలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ ను కోల్పోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, పోశెట్టిగౌడ్, పాండుగౌడ్, బ్రహ్మానంద గౌడ్, నాగేష్ గౌడ్, పద్మయ్య, తదితరులు ఉన్నారు.