హైదర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
హైదర్ నగర్ డివిజన్ సమతా నగర్లోని కార్పొరేటర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం అమరవీరులకి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తుచేశారు.
నూతన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హైదర్నగర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి తాము నిరంతరం కట్టుబడి ఉన్నామని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. డివిజన్ ప్రజలందరికీ ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
