గద్దె సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా 5 లక్షల ఆర్థిక సాయం
బుచ్చిరెడ్డిపాళెంపురపాలక సంఘంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించినటువంటి గద్దె సుబ్రహ్మణ్యం వారి కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కారణంగా మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అలాగే బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ఆర్థిక సహాయం కింద వారికి 5 లక్షల రూపాయలు చెక్కునువారి చేతుల మీదుగా నెల్లూరులోని వి. పి.ఆర్. కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులు, భార్య మంగమ్మ, కుమారుడు సూర్యకి ఆర్థిక పరిహారంగా ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యరటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు, మరియు ఆఫీస్ ఇబ్బంది పాల్గొన్నారు…

