సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఇవాళ విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో వెల్లడించారు. ఈ యాత్ర అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు కొనసాగనుందని చెప్పారు. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టి అక్కడే బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా, ఎమ్మెల్యే, సీనియర్ నేతల ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది…. మీ. గెడ్డం గాంధిబాబు
Posted inAndhrapradesh