మంచినీటి ఎద్దడి తీర్చాలని ఖాళీ బిందెలతో నాగమ్మ తాండ గిరిజన మహిళలు ప్రజావాణిలో ఫిర్యాదు

Sakshitha news

మంచినీటి ఎద్దడి తీర్చాలని ఖాళీ బిందెలతో నాగమ్మ తాండ గిరిజన మహిళలు ప్రజావాణిలో ఫిర్యాదు

సాక్షితవనపర్తి
వనపర్తి మండలం కాసిం నగర్ గ్రామపంచాయతీ ఆమ్లెట్ విలేజ్ నాగమతాండ కు చెందిన గిరిజన మహిళలు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని వారం రోజులకోసారైనా రావడం లేదని ఖాళీ బిందెలతో కలెక్టరేట్కు చేరుకొని ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచుతో కలిసి ఫిర్యాదు చేసినట్లు గిరిజన మహిళలు తెలిపారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని అందుకే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు తెలిపారు.