పొగాకు రహిత సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ……..జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జి. కళార్చన
*సాక్షిత వనపర్తి :
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవధికార సంస్థ వనపర్తి పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో దినవారి కూలీలకు పొగాకు వలన కలిగే నష్టాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కళార్చన మాట్లాడుతూ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వలన తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతారని తెలియజేశారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వారితోపాటు వారి కుటుంబంలోని వ్యక్తులకు కూడ ప్రమాదకరం అని అన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆర్థిక నిలువలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్. రామచంద్ర రావు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ పొంది భవిష్యత్తును సుఖమయం చేసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ కళాజాత సువర్ణ బృందం వారి పాటలతో ప్రజలను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపరిచారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డాక్టర్ రియా శ్రీ, పట్టణ ఎస్సై హరి ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, జూనియర్ డాక్టర్ శశాంక్, పారా లీగల్ వాలంటీర్లు రవీందర్, అనిల్ లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
