మంగళగిరి మండలంలోని 13 పాఠశాలలకు టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సి.ఎస్.ఆర్ క్రింద రూ.33 లక్షల విలువైన ఫర్నిచర్, క్రీడా సామగ్రి, వంట సామగ్రి అందజేసింది. బెంచీలు, డెస్కులు, కుర్చీలు, పోడియంలు, అల్మరాలు, వాలీబాల్, షటిల్, క్యరమ్, క్రికెట్ కిట్లు, స్టవ్లు, కుక్కర్లు వంటి సామగ్రి మొత్తం 13 పాఠశాలలకు పంపిణీ చేశారు.కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, టయోటా అధికారులకు అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింతగా పాల్గొనాలని సూచించారు. కంపెనీ ఏపీ హెడ్ బి. నిఖిల్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
