రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి

Sakshitha news

గత కొన్ని సంవత్సరాలుగా తేలికపాటి వర్షం పడితే చాలు రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి అని తెలిసి ఈ వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి జిహెచ్ఎంసి జోనల్ కమీషనర్ గారిని ఓపెన్ డ్రైన్ కట్టడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరి సుమారు 23.00 లక్షల నిధులు మంజూరు చేయించి,ఈరోజు రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో స్థానిక కాలనీ అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి,జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్,ఏఈ దివ్య తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ గారు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.వారితో చంద్రశేఖర్ గుప్తా,తిరుమల్ గౌడ్,శశికళ యాదవ రెడ్డి,వీర రెడ్డి,మాధవ రెడ్డి,రాజశేఖర్,యాదయ్య,సిఎం మల్లేష్,వెంకట్ రెడ్డి,విఠల్ రెడ్డి,భుజంగ రెడ్డి,నిరంజన్ రెడ్డి,సహదేవ్ గౌడ్,తదితరులు.