హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అయ్యప్పలకు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి డిసెంబర్ 4 వ తారీకు వరకు అన్నదానం తన ఆధ్వర్యంలో దాతల సహకారంతో జరుగుతుందని, కావున అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు అందరూ అన్నదానం లో పాల్గొని ఆ అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరని చెప్పడం జరిగింది.

