ఏపీలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

Sakshitha news

ఏపీలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

అమరావతి : జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబి తాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆంగ్లం, సంస్కృతం, గణితం, జంతుశాస్త్రం, చరిత్ర సబ్జెక్టు లకు 17 మంది అభ్యర్థుల ఎంపిక జాబితాను వెబ్ సైట్లో ఉంచింది. మొత్తం 47 పోస్టులకు 2023 డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో అనుత్తీర్ణులు కావడం, ఉర్దూ పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఆరు సబ్జెక్టుల ఫలితాలను పెండింగ్లో పెట్టింది. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.10 సబ్జెక్టులకు సంబంధించి 25 మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచింది.

Scroll to Top