ఇంద్రకీలాద్రి, విజయవాడలో జరుగుతున్న నిత్య (ఉచిత ప్రసాద వితరణ) చీరాల, వైకుంఠపురానికి చెందిన వై.బి.పి. నాయుడు (తండ్రి: వై. కృష్ణారావు) రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కి నేరుగా అందజేయడం జరిగింది. అమ్మవారి సేవలో భాగస్వాములైన దాతల భక్తిని అభినందిస్తూ, వారి కుటుంబానికి అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని ఆలయ వర్గాలు ఆకాంక్షించాయి

