కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P. వివేకానంద పెట్బషీరాబాద్ క్యాంప్ ఆఫీస్‌

Sakshitha news

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P. వివేకానంద పెట్బషీరాబాద్ క్యాంప్ ఆఫీస్‌లో GHMC పరిధిలోని 8 వార్డులు మరియు 3 మున్సిపాలిటీల విభజన సమస్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

సమావేశంలో ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో GHMC పరిధిలోని 8 డివిజన్లు మరియు దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల డివిజన్ల విభజన ప్రక్రియను సమీక్షించారు. ప్రజల అభ్యంతరాలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చినా, GHMC అవసరమైన వివరాలు ప్రజలకు అందించకపోవడం వల్ల పెద్ద ఎత్తున అయోమయం ఏర్పడిందని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యే గారు సమావేశంలో క్రింది ప్రధాన అంశాలను ప్రస్తావించారు:

  1. డివిజన్ల విభజన ప్రక్రియ సక్రమంగా, విధివిధానాలకు అనుగుణంగా జరగలేదు.
  2. పునర్విభజనకు అవసరమైన తాజా డివిజన్ మ్యాప్‌లు ఇప్పటికీ GHMC అందించలేదు.
  3. ప్రతి డివిజన్ పరిధిని గుర్తించేందుకు అవసరమైన ఇంటి నంబర్ల వివరాలు ప్రకటించలేదు.
  4. జనాభా లెక్కల ప్రకారం ఎన్‌యూమరేషన్ బ్లాక్‌ల వివరాలు వేళ్లడించలేదు.
  5. పోలింగ్ బూత్‌ల జాబితా కూడా ప్రకటించలేదు.
  6. కాలనీ పేర్లు స్పష్టంగా లేకపోవడం వల్ల ప్రజలు తమ డివిజన్ సరిహద్దులను గుర్తించలేకపోతున్నారు

ఈ ముఖ్యమైన వివరాల లేమితో GHMC నిర్ణయించిన గడువు లోపల ప్రజలు ఎలా అభ్యంతరాలు సమర్పించగలరో ఎమ్మెల్యే ప్రశ్నించారు.

నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా GHMC వెంటనే:

  • డివిజన్ మ్యాప్‌లు,
  • కాలనీ జాబితాలు,
  • ఇంటి నంబర్ వివరాలు,
  • పోలింగ్ బూత్ సమాచారం,
  • ఎన్‌యూమరేషన్ బ్లాక్ డేటా
  • అన్నివాటినీ పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు కూడా ఈ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సంబంధిత GHMC ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు.