పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించండి
- జిల్లాస్థాయి పీజీఆర్ఎస్-రెవెన్యూ క్లినిక్కు 88 అర్జీలు
- కార్యక్రమానికి 85 రెవెన్యూ యేతర అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, నిబద్ధతతో, నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, మరో సమావేశ మందిరంలో నాన్ రెవెన్యూ పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 85 రెవెన్యూ యేతర అర్జీలురాగా వీటిలో పోలీసు శాఖకు 19, పురపాలన 15, పంచాయతీరాజ్ 10, డీఆర్డీఏ 8, వైద్య ఆరోగ్యం 5, పౌర సరఫరాల శాఖకు 4 అర్జీలు వచ్చాయి.
అదేవిధంగా విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు మూడు చొప్పున, రహదారులు-భవనాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఇరిగేషన్, రవాణా, డ్వామాలకు రెండు చొప్పున అర్జీలు అందాయి. కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్కు 88 అర్జీలు వచ్చాయి. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో నిర్దేశ గడువులోగా అర్జీలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సూచించారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
