ఢిల్లీ జంతర్ మంతర్ లో వన్ వాయిస్… వన్ విజన్…యునైటెడ్ బీసీ

Sakshitha news

ఢిల్లీ జంతర్ మంతర్ లో వన్ వాయిస్… వన్ విజన్…యునైటెడ్ బీసీ అనే నినాదంతో జరిగే మహా ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు..

స్వాతంత్ర భారతదేశంలో బహుజన వర్గాలకు విద్య,ఉద్యోగం,రాజకీయం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ,ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా బీసీ కుల,జన గణన చేసి దేశానికి ఆదర్శనంగా నిలిసింది కావున కేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ పెద్దలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్, రాష్ట్ర మంత్రి , ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు,కార్పొరేషన్ చైర్మన్ లు, బీసీ సంఘాల నాయకులు, ఇండియా కూటమి ఎంపీ లతో కలిసి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు…

ఈ మహా ధర్నా కార్యక్రమానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యతిధిగా హాజరు కానున్నారు..