రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. రాత్రి 7 దాటితే నో కాల్స్!

Sakshitha news

రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. రాత్రి 7 దాటితే నో కాల్స్!

రుణగ్రహీతలను రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి రక్షించేందుకు ఆర్బీఐ కఠినమైన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త
నిబంధనల ప్రకారం, ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయాలి లేదా కలవాలి. రాత్రి వేళల్లో ఫోన్ చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం, సామాజిక మాధ్యమాల్లో వేధించడం చట్ట విరుద్ధం.నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లు, బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ
హెచ్చరించింది.

Scroll to Top