సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్

Sakshitha news

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజులరామారం చౌరస్తా నుండి మహాదేవపురం వరకు ఉన్న రహదారి ఆక్రమణలను అధికారులు తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు కట్టినిచో అట్టి అక్రమ కట్టడాలుపై కఠిన చర్యలు తీసుకోబడునని గాజులరామారం ఉప కమిషనర్ U.VENKAT RAMULU హెచ్చరించారు . ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ACP) ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (TPS) బి. సరిత సేన్ తమ సిబ్బందితో కలిసి పాల్గొని పర్యవేక్షించారు. రహదారులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Scroll to Top