మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

Sakshitha news

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

సాక్షిత వనపర్తి ఆగస్టు 2
_వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని
ఇందిరా కాలనీ 5 వ వార్డు కు చెందిన పసుపుల బాలయ్య కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

_వనపర్తి పట్టణంలో ఇందిరా కాలనీ 5 వ వార్డుకు చెందిన పసుపుల బాలయ్య ఈరోజు మరణించడం జరిగింది స్థానిక నాయకులు ఈరపోగు శ్రీనివాసులు కందికోట శ్రీను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది సోమనాథ్,ఈరపోగు అంజి, గొర్ల అనిల్, జి నారాయణ, జి కుమార్ అందరు కలిసి మరణించిన పసుపుల బాలయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది