సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి..*ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…
సాక్షిత) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కొనసాగుతున్న ‘SIR’ కార్యక్రమాన్ని నిర్ణీత వ్యవధిలోగా, అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కోదాడ శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి సంబంధిత బృందాలకు మరియు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కంప్లీట్ చేయడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై ఆమె పలు కీలక సలహాలు, సూచనలు అందజేశారు. అందరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా ముందుకు సాగి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని ఈ సందర్భంగా తెలియచేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
