ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సహాయం కల్పించాలి………. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు స్వయంగా ముందస్తు పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి, బయట అప్పులు చేయకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జిల్లా కలెక్టర్ గోపాలపేట మండల పరిధిలో బుద్ధారం గ్రామాన్ని సందర్శించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో గతంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికే మంజూరు చేసిన ఈ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను త్వరగా గుర్తించాలని తహసిల్దార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరలోనే పట్టాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో గతంలో కొందరు అకతవకలకు పాల్పడ్డారని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే, గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణం కోసం ఎవరితోనూ అప్పులు చేయవద్దని సూచించారు. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక అవసరం ఉంటే స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా రుణాలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
హౌసింగ్ పీడీ విఠోబా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి విజయ్ కుమార్, తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY