SAKSHITHA NEWS

|| శ్రీ డా|| వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఘననివాళిలు అర్పించించిన కొలన్ హన్మంత్ రెడ్డి||

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ శ్రీ డా|| వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళిలు అర్పించించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు. ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతు మహానేత వైఎస్సార్ గారి సేవలను కొనియాడారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలిచిన మహానేత వైస్సార్ అని కొనియాడారు. సమకాలీన రాజకీయాల్లో వైస్సార్ గారి లోటు తీరనిది అని అన్నారు. వైస్సార్ గారి ఆశయాల సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి,NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి,18 వార్డ్ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, CH . జీతయ్య ముదిరాజ్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, నవీన్, రాజి రెడ్డి, విక్రమ్, గణేష్, గఫ్ఫార్, అజయ్, సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS