ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలకు సంబంధించిన

Sakshitha news

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలకు సంబంధించిన నోట్:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి ఈ శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా (Average) ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ Special Grade Dy. Collector సీనా నాయక్ స్వయంగా పర్యవేక్షించారు.
రద్దీ సాధారణంగా ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తుల రాక సజావుగా సాగుతుండటంతో, ఎక్కడా ఆగకుండా దర్శనం వేగంగా పూర్తవుతోంది. ఆలయ సిబ్బంది సమన్వయంతో భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Scroll to Top