వడ్డెరపాలెంలో ఘనంగా గృహప్రవేశ వేడుక

Sakshitha news

వడ్డెరపాలెంలో ఘనంగా గృహప్రవేశ వేడుక

హాజరైన జనసేన నాయకులు

చిలకలూరిపేట:పట్టణంలోని 26వ వార్డు పరిధిలో ఉన్న వడ్డెరపాలెంలో బొంతు తవిటి నాయుడు నూతన గృహప్రవేశ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ విచ్చేసి, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజా సేవలో ముందుంటాం: మండలనేని చరణ్ తేజ

ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ, సామాన్య ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. నూతన గృహం ఆ కుటుంబానికి సుఖసంతోషాలను చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

హాజరైన ప్రముఖులు

ఈ గృహప్రవేశ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, ప్రముఖ న్యాయవాది బైరా కృష్ణ ప్రత్యేకంగా హాజరయ్యారు. వారితో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొని తవిటి నాయుడు కుటుంబ సభ్యులను అభినందించారు.

Scroll to Top