శంకర్ రావు ని పరామర్శించిన..,…….*డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
సాక్షిత వనపర్తి :
వనపర్తి మండలం అప్పాయి పల్లె గ్రామానికి చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ శంకర్ రావు భార్య మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆమె పార్తివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శంకర్ రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.సతీమణి చనిపోయిన బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలనిశంకర్ రావు కు ధైర్యం చెప్పారు.
నివాళులు అర్పించిన వాళ్లు టీపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి సింగల్ విండో అధ్యక్షులు సహదేవుడు, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నారాయణ, సీనియర్ నాయకులు నందిమల్ల రామ్,గోవర్ధన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
