డేంజర్ గా మారుతున్న డీజేలు : డీజే శబ్దాల వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు

Sakshitha news

డేంజర్ గా మారుతున్న డీజేలు : డీజే శబ్దాల వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు

*సాక్షిత : డీజే శబ్దాలు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెవులు గరిష్టంగా 120-130 డేసీబుల్స్ వరకు మాత్రమే భరిస్తాయి. 100 డేసీబుల్స్ దాటితే గుండె జబ్బులు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 120 దాటితే చిరాకు,తలనొప్పి,160 పైగా వెళ్తే వినికిడి కణాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం, 190 దాటితే కర్ణభేరి పగిలి శాశ్వత వినికిడి లోపం వస్తుందని నిపుణులు హెచ్చరించారు.