నూతనకల్లో ధాన్యం నాణ్యత తనిఖీ చేసిన ఏఈఓ
సాక్షిత, సూర్యపేట జిల్లా ప్రతినిధి : నూతనకల్ FPC ధాన్యం కొనుగోలు కేంద్రంలో నాణ్యత పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనకల్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి బుసిగంపల జానయ్య గౌడ్ రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తనిఖీ చేశారు. తేమ శాతం 17 శాతంగా ఉన్న రైతులకు కాంటాలు వేయుటకు టోకెన్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్ఛార్జ్ బద్దం జ్యోతి, FPC సీఈఓ శైలజ,ఇమ్మారెడ్డి రేణుక తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. అధికారులు రైతులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధాన్యాన్ని పూర్తిగా ఎండించి, శుభ్రంగా వడకట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
