SAKSHITHA NEWS

సూచిక బోర్డు లు లేకపోవడం తో వరుస ప్రమాదాలు

శంకరపల్లి :ఆగస్ట్ 03: (సాక్షిత న్యూస్ )శంకరపల్లి మండల పరిధి కొండకల్ లో రోడ్ ప్రమాదం జరిగింది .కొల్లూరు నుండి మోకిలా వైపు వెళ్తున్న కారు కొండకల్ జిల్లా పరిషత్ పాఠశాల దగ్గర హెచ్చరిక బోర్డులు లేకపోవడం తో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ లో నుండి కారుని జేసీబీ సహాయం తో తీసే సమయం లో బారి ట్రాఫిక్ నిలిచిపోయింది .కార్ లో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . హెచ్చరిక బోర్డు లు లేకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి . తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని వాహన దారులు మండిపడ్డారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download App


SAKSHITHA NEWS