అదుపుతప్పి కాలువలో పడ్డ బైక్.. బాలిక మృతి

Sakshitha news

అదుపుతప్పి కాలువలో పడ్డ బైక్.. బాలిక మృతి

పల్నాడు జిల్లా

రెంటచింతల మండలం

మిట్ట గూడుపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో 13 ఏళ్ల బాలిక మూన్సీ అక్కడికక్కడే మృతి చెందింది.

గురజాల మండలం సమాధానంపేటకు చెందిన భోజావత్ శ్రీను నాయక్ తన కుమార్తెను కస్తూరి పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

బైక్ ఆమె మీద పడటంతో మరణించింది.

ఈ ప్రమాదంలో శ్రీను నాయక్ గాయాలపాలయ్యాడు.

Scroll to Top