ప్రజావాణిలో గాజురామారం, సర్కిల్, కమిషనర్ కు, ఫిర్యాదు సూరారం ఎక్స్ రోడ్లో నత్త నడకన నడుస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిసి త్వరగా పూర్తి చేయాలని అక్కడున్న రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించే విధంగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాలని విన్నవించడం జరిగింది. దీనితో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవడం ప్రజలకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు తీవ్ర ఆలస్యమవుతుందని తెలియపరచడం జరిగింది, మరియు సర్కిల్ పరిధిలో నాణ్యతలేని ప్లాస్టిక్, ఇస్తరాకులు విచ్చలవిడి గా,వాడడం వల్ల గోమాత, జలమాత,భూమాత, సర్వనాశనమయ్యే ప్రమాదం ఉంది కావున ఫంక్షన్ హాల్ వాళ్లకు హోటల్స్ లకు, రై తు బజార్ వారికి,వచ్చే నెలలో జాతర్లలో మీరు ముందుగా నోటీసులు ఇవ్వాలని గుడిలో ప్లాస్టిక్, కవర్లు, ఇస్తార్లు, వాడరాదనీ ఆ యొక్క కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఎండోమెట్, వారికి తెలియపరచాలని కోరడమైనది,


SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
