పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుల నియామకం….

Sakshitha news

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుల నియామకం….

పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి: ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌….

మూడు నియోజకవర్గాల పరిధిలో నూతన మండల అధ్యక్షుల ప్రకటన….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : పెద్దపల్లి జిల్లా పరిధిలోని మండలాలకు కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షులను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌ అనుమతితో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షుల నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో నూతన కమిటీలు కీలక పాత్ర పోషించాలని ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ ఆకాంక్షించారు.

మంథని నియోజకవర్గం
మంథని — విల్‌ ప్రసాద్‌
మంథని ముత్తారం — దొడ్డ బాలరాజు
రామగిరి — తుమ్మసారం గౌడ్‌
కమాన్‌పూర్‌ — సయ్యద్‌ అన్వర్‌
పెద్దపల్లి నియోజకవర్గం
పెద్దపల్లి — కట్లూరి సుదాకర్‌ రెడ్డి
ఓదెల — మూల శ్రీనివాస రెడ్డి
కాల్వ శ్రీరాంపూర్‌ — గజవేన సదయ్య
సుల్తానాబాద్‌ — చిలుక సతీష్‌
ఎలిగేడు — సామ రాకేష్‌ రెడ్డి
జూలపల్లి — బొజ్జ శ్రీనివాస్‌
సుల్తానాబాద్‌ పట్టణం — వి. అభ్యుదయ గౌడ్‌
పెద్దపల్లి పట్టణం — భూతగడ్డ సంపత్‌
రామగుండం నియోజకవర్గం
అంతర్గాం — సింగం కిరణ్‌
పాలకుర్తి — ముక్కెర శ్రీనివాస్‌
ధర్మపురి నియోజకవర్గం
ధర్మారం — తాళ్లపల్లి రూపేష్‌ నాయక్‌