ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ డివిజన్లోని సింహపురి కాలనీ డి బ్లాక్ లో పర్యటించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ సౌకర్యాలు, పార్కు అభివృద్ధి, పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటుతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నివాసితులు కోరారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…
అనంతరం లహరి గ్రీన్ పార్క్ కాలనీలో మొక్కను నాటారు, కాలనీలో పర్యటించారు. అక్కడ కూడా సరైన రోడ్లు, డ్రైనేజీ పైపులైన్, పార్క్ డెవలప్మెంట్, మంచినీటి మరియు ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు కోరారు. నివాసితులు తెలిపిన సమస్యలను పరిశీలించి, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. నివాసితుల ఆందోళనలను వెంటనే పరిష్కరించాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బౌరంపేట ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళి యాదవ్, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు ఎస్వీ సురేందర్ రెడ్డి, ధర్మా రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, సంజీవ్, బైండ్ల గోపాల్, కిరణ్, సాంభ శివారెడ్డి, ఏఈ సురేందర్ నాయక్, సింహపురి కాలనీ డి బ్లాక్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, లహరి గ్రీన్ పార్క్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ విష్ణు మరియు నాయకులు, కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
